- Advertisement -
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికలకు వెల్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ భవన్లో పార్టీ కార్యవర్గ సమావేశం జరింగింది. ఎన్నికల గురించి ఇప్పటికే ఆరు సర్వేలు చేయించానని, వచ్చే ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని తెలంగాణ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఎన్నికలు జరిగితే ముందస్తు ఎన్నికలు కాదని, ఇప్పటికే ఎన్నికల సమయంలోకి వచ్చామని అన్నారు. నిర్ణీత సమయానికి ఆర్నెళ్ల ముందు జరిగే ఎన్నికలు ముందస్తు ఎన్నికలు కాదని అభిప్రాయపడ్డారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై కేసీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి ఏర్పాటులో తన ప్రయత్నం ఆగదని చెప్పారు.