రంగస్థలం హిట్తో కెరీర్లోనే బిగెస్ట్ హిట్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్చరణ్. ఈ సినిమా తరువాత కమర్షియల్ దర్శకుడు బోయపాటితో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్.బోయపాటితో సినిమా అంటే ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అందరికి తెలిసిందే.తన సినిమాలో హీరోని ఫుల్ మాస్గా ,వారి అభిమానులు ఏవిధాంగా కోరుకుంటారో ఆ విధాంగా చూపిస్తాడు బోయపాటి. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అజర్బైజాన్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్కడే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రికరిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. చిరంజీవికి మాస్ హిట్ ఇచ్చింది స్టేట్ రౌడీ.ఈ సినిమా టైటిల్నే తన సినిమాకు పెట్టుకుంటున్నాడు రామ్ చరణ్.విజయదశమి రోజున టైటిల్ తో పాటు ఫస్టులుక్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. సినిమాలో హీరోయిన్గా భరత్ అనే నేను బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది.