- Advertisement -
భారత్ తో ట్వంటీ 20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఓడిపోవడానికి తానే కారణమని, తనను క్షమించాలని బంగ్లాదేశ్ ఆటగాడు మహ్మదుల్లా అన్నాడు. తాను క్రీజ్ లో ఉన్నంత వరకూ విజయం తమదే అనుకున్నానని, అయితే చివరిలో భారీ షాట్ కు యత్నించి ఓటమి పాలయ్యామని మహ్మదుల్లా వివరణ ఇచ్చారు.
తాను ఆ బంతిని ఆ విధంగా ఆడి ఉండాల్సింది కాదని, తనను దేశ ప్రజలు క్షమించాలని కోరాడు. ఈ మాటలు మ్యాచ్ ముగిసిన వెంటనే చెప్పాల్సిందని, కాని ఆలస్యమైందని కూడా మహ్మదుల్లా వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ లో భారత్ ఒక్కటంటే ఒక్క పరుగుతో విజయం సాధించిన విషయం తెలిసిిందే.