టాలీవుడ్లో అడల్ట్ కథలకు మంచి డిమాండ్ ఉండటంతో ప్రస్తుతం అలాంటి కథలే ఎక్కువుగా తెరకెక్కుతున్నాయి.తాజాగా విడుదల అయిన ఏడు చేపల కథ అనే ఓ చిన్న సినిమా టీజర్ యూట్యూబ్ను షేక్ చేస్తుంది.అడల్ట్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్లో సంచలనంగా మారింది.ఇప్పుడు ఈ టీజర్ అత్యధిక వ్యూస్తో యూట్యూబ్లో రికార్డు క్రియేట్ చేస్తోంది.టాలీవుడ్ లో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు అమ్మాయిలు ‘మీటూ’ అంటూ తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపు గురించి వెల్లడించారు.
అయితే ఈ సినిమాలో హీరో ‘మీటూ’ అంటూ కథను మొదలుపెట్టాడు. పూర్తి స్థాయి అడల్ట్ కామెడీ జోనర్ లో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేం భాను శ్రీ కనిపించనుంది. ఈ టీజర్ తెలుగులో కాకుండా తమిళంలో కూడా సంచలనం కావడం విశేషం.త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.