- Advertisement -
నటుడు ,జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఉదయం చెన్నై చేరుకున్నారు.పవన్ నేరుగా విలక్షణ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ ఇంటికి బయలుదేరారు. మరికాసేపట్లో ఆయన కమల్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. దేశ రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చిస్తారని సమాచారం.
ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఆయన, తనకు అభిమానులున్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపే క్రమంలో పొరుగు రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఈ మధ్యాహ్నం పవన్ కల్యాణ్, హోటల్ కన్నెమెరాలో మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడతారు. ఈ సమావేశంలో పవన్ కీలక ప్రకటన చేస్తారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.అయితే పవన్ దేని గురించి మాట్లాడతారనే దానిపై స్పష్టత లేదు.