హీరోయిన్ మెహ్రీన్ ఈ మధ్య సినిమాల కన్నా వివాదలతోనే ఎక్కువ వార్తల్లో నిలుస్తుంది. తన పారితోషకం విషయంలో వార్తల్లో నిలిచిన ఆమె మరో వివాదంలో ఇరుక్కుంది.సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా మెహ్రీన్ను ఎంపిక చేశారు. నిర్మాతలతో గొడవ కారణంగా సుధీర్ బాబు ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.దీంతో ఈ సినిమాలో చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ను హీరోగా తీసుకున్నారు.
కల్యాణ్ దేవ్ పక్కన అయితే సినిమా చేయనని చెప్పిందట మెహ్రీన్.దీంతో నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్ ఇవ్వమని అడిగారు.దానికి మెహ్రీన్ అంగీకరించకపోవడంతో ఇప్పుడు ఈ గొడవ కాస్త ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్అసోసియేషన్ కి చేరింది. తన కాల్షీట్ లను వృధా చేశారని, రెండు పెద్ద సినిమాల ఛాన్స్ లు పోయాయని మెహ్రీన్ గొడవ చేస్తుందట. అటు నిర్మాత కూడా తన అడ్వాన్స్ ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నాడట.మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తూందో చూడాలి.
- ప్రొస్టేట్ క్యాన్సర్..ఈ అవగాహన తప్పనిసరి!
- మాజీ ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య!
- పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
- ఆ విషయంలో ‘పెద్ది’ డైరెక్టర్ అసంతృప్తి!
- కొత్త పింఛన్లు.. కంచికేనా?
