వంగవీటి ఈ పేరు విజయవాడ రాజకీయాలలో పెను సంచలనమే అని చెప్పాలి. విజయవాడ రాజకీయాలను ప్రభావితం చేసిన వారిలో వంగవీటి కుటుంబీకులు కూడా ఒకరు. కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశంపై తీవ్ర పోరాటం చేసిన వంగరంగాను అప్పటి తెలుగుదేశ ప్రభుత్వం చంపిందని అందరికి తెలిసిందే. మరి అలాంటి పార్టీలోకి ఆయన కొడుకు వంగవీటి రాధా చేరబోతున్నాడనే వార్తను రంగా అభిమానులు జీర్ణించుకులేకపోతున్నారు. తండ్రిని చంపిన పార్టీలో రాధా ఎలా చేరతాడని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
విజయవాడ సెంట్రల్ సీటు కోసం వైసీపీకి రాజీనామా చేసిన రాధా జనసేనలోకి వెళ్తారని అందరు భావించారు. కాని అనుహ్యంగా రాధా టీడీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నాడు. అయితే రాధా తప్పుడు నిర్ణయం తీసుకున్నారనే వారి అనుచరులే చర్చించుకోవడం విశేషం. నిన్నటి వరకు రాధాకు మద్దతుగా వైసీపీకి రాజీనామా చేసిన మద్దతుదారులు ఇప్పుడు రాధా నిర్ణయాన్ని తప్పుపడుతు రాధాకు దూరంగా వచ్చేస్తున్నారు. నిన్న వైసీపీకి రాజీనామా చేసిన కొందరు కార్పోరేటర్లు ,రాధాతో కలిసి టీడీపీలో చేరడం ఇష్టం లేక తిరిగి వైసీపీలో చేరుతున్నట్లు సమాచారం. ఈ నెల 25న రాధా టీడీపీలో చేరబోతున్నారని వినికిడి. రాధా టీడీపీలో చేరడం వారి అనుచరులకే నచ్చడం లేదు.
రాధాకు ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయిన, ఎమ్మెల్యీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ అయితే వైసీపీ కూడా ఇస్తానంది కదా.. దీని కోసం పార్టీ మారడం ఏంటీ అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి రాధా కనుక టీడీపీలో చేరితే విజయవాడలో వంగవీటి శకం ముగిసినట్లే అని విజయవాడ వాసులు భావిస్తున్నారు.