మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గాఉంటారన్న సంగతి అందరికి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఉపాసన తెలంగాణ మాజీ మంత్రి ,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఓ ట్వీట్ చేసింది. దీంతో ఆమె రాజకీయాలలోకి వస్తారనే ఓ రూమర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.ఆమె అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉపాసన చేవెళ్ల నియోజివ వర్గం నుంచి లోక్సభకు పోటీ చేస్తారని ఆ అ వార్తల సారాంశం.
రామ్ చరణ్ ,కేటీఆర్లు మంచి స్నేహితులు కావడంతో ఈ వార్త నిజమేనని చాలామంది నమ్ముతున్నారు. ఉపాసనను రంగంలోకి దించడం ద్వారా మెగా ఫ్యాన్స్ ఓట్లు సాధించేలా కేటీఆర్ ప్లాన్ చేశారని వినికిడి. తాజాగా తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు ఉపాసన. తాను రాజకీయాలలోకి రావట్లేదని, మీరు ఎవరి మీద అయితే పోటీ చేయమంటున్నారో, ఆయన స్వయన తనకు బాబాయ్(కొండా విశ్వేశ్వ రెడ్డి) అవుతారని చెప్పుకొచ్చింది. తన పిన్ని మాటను నేను ఎప్పుడు కాదనలేదని ,ఆమె తనకు బాస్ అని తెలిపింది ఉపాసన. తాను ఆపోలో హాస్పిటల్లో ఓ ఉద్యోగినని తాను ఉద్యోగాన్ని మాత్రమే ప్రేమిస్తానని,రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది.