Tuesday, April 30, 2024
- Advertisement -

కౌశ‌ల్ మా డ‌బ్బుల‌తో ఎంజాయ్ చేసేవాడు – కౌశ‌ల్ ఆర్మీ ఫౌండర్

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ద్వారా వెలుగులోకి వ‌చ్చాడు కౌశ‌ల్‌. ఈ రియాల్టీ షోకు ముందు కొద్దిమంది టీవీ ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే మ‌నోడు తెలుసు. ఈ షో ద్వారా రెండో తెలుగు రాష్ట్రాల‌లో బాగానే ఫేమ‌స్ అయ్యాడు కౌశ‌ల్‌. ఈ షో ద్వా రా చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ రియాల్టీ షో ద్వారా అతనికి ఓ ఆర్మీ కూడా క్రియేట్ అయింది. బిగ్‌బాస్ హౌస్‌లో కౌశ‌ల్‌కు వ్య‌తిరేకంగా ఎవ‌రు మాట్లాడిన వారిని ట్రోలింగ్ చేసేవారు ఈ ఆర్మీ. కౌశ‌ల్ బిగ్‌బాస్ విన్న‌ర్‌గా నిల‌వ‌డంలో ఈ ఆర్మీ చాలా ప్రముఖ పాత్ర పోషించింద‌ని అంద‌రికి తెలిసిన విష‌య‌మే. అయితే ఇప్పుడు స‌డ‌న్‌గా కౌశ‌ల్‌పై ఈ ఆర్మీ నెగిటివ్ కామెంట్స్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. కౌశ‌ల్‌కు డ‌బ్బు పిచ్చి ఎక్కువ అయింద‌ని కౌశ‌ల్ ఆర్మీ ఫౌండర్ ఇమామ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అంద‌రిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

డబ్బు లేకపోతే ఫ్యాన్స్‌ని కూడా పట్టించుకోడని, కౌశల్ ఎక్కడికి వెళ్లినా కౌశల్ ఆర్మీ ఖర్చు భరించాల్సి వచ్చేదని తెలిపాడు ఇమామ్. అభిమానుల డ‌బ్బుతో కౌశ‌ల్ ఎంజాయ్ చేసేవాడ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అఖ‌రికి అత‌ను ఫ్లైట్ టికెట్లకు కూడా అభిమానులే డ‌బ్బులు స‌మ‌కుర్చేవార‌ని చెప్ప‌డం అందరికి షాక్ గురి చేస్తోంది. బిగ్‌బాస్ ద్వారా వచ్చిన డబ్బుని ఫౌండేషన్‌కి ఉపయోగిస్తానని చెప్పిన మాటల్లో కూడా నిజం లేదని అన్నారు. అభిమానులు ఫౌండేషన్‌కి ఇచ్చిన డ‌బ్బును కూడా కౌశ‌ల్ దుర్వినియోగం చేశార‌ని తెలిపారు. కౌశ‌ల్ లాంటి వ్య‌క్తి స‌మాజనికి డేంజ‌ర్ అని సంచలన కామెంట్స్ చేశారు ఇమామ్. కౌశ‌ల్ అభిమానుల‌ను బ‌లిప‌శువుల‌ను చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కౌశ‌ల్ ఆర్మీ ఫౌండర్ ఇమామ్. మ‌రి దీనిపై కౌశ‌ల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -