ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీకి కోస్తా జిల్లాల్లో భారీ షాక్ తగిలింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల అవడంతో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా టీడీపీ ఎంపీ తోట నరసింహం, ఆయన భార్య వైసీపీ తీర్థంపుచ్చుకున్నారు. కొన్నాళ్లుగా వీరు టీడీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బాబును కలిసినా వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇవ్వకపోవడంతో మనస్థాపం చెందిన తోటా ఫ్యామిలీ వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్తో పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్పాండ్లో భేటీ అయ్యారుజ అనంతరం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ లోక్సభలో టీడీపీ ప్రతిపక్ష నేతగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా నినాదంతో నిరంతర పోరాటం చేశానన్నారు. తాను అనారోగ్యానికి గురవ్వడానికి కారణం నిరంతర పోరాటమేనని వైద్యులు తెలిపారన్నారు. అమరావతిలో బాబును కలసి కలసి తమకు న్యాయం చేయాలని కోరామని, హామీ ఇచ్చారే తప్ప న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేసనట్లు సమాచారం. తన కుటుంబాన్ని గుర్తించి జగన్ సీటు కేటాయించడం గర్వకారణమన్నారు.
చంద్రబాబుపై తోటా వాణి తీవ్ర విమర్శలు చేశారు. నా తండ్రిని అవమానించిన వ్యక్తిపై పోటీ చేస్తానని ఎంపీ తోట సతీమణి తోట వాణి అన్నారు. ప్రస్తుతం పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే, హోమంత్రి అయిన చినరాజప్పమీద తోట వాణి పోటీ చేయనున్నారు. వైసీపీ తరపున పెద్దాపురం నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్నానన్నారు. తన భర్త ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పటికీ టీడీపీ ప్రతినిధులు పలకరించలేదన్నారు. తమ కుటుంబంపై కావాలనే రాజకీయ కుట్రలు చేస్తున్నారన్నారు.