- Advertisement -
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో యువకుడి డెడ్ బాడీ కనిపించడం కలకలం రేపింది. తన దగ్గర డ్రైవర్ గా పని చేసిన సుబ్రమణ్యం అనే వ్యక్తిని గురువారం ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు తనతో పాటు కారులో తీసుకెళ్లారు.
అర్థరాత్రి అతడి డెడ్ బాడీని తీసుకొచ్చాడు. రోడ్డు ప్రమాదంలో సుబ్రమణ్యం చనిపోయాడంటూ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీని నిలదీశారు. దీంతో సుబ్రమణ్యం డెడ్ బాడీతో పాటు తన కారును అక్కడ వదిలేసి వెళ్లిపోయారు.
అనంత ఉదయ్ బాబు దగ్గర ఐదేళ్ల పాటు డ్రైవర్ గా పని చేసిన సుబ్రమణ్యం నాలుగు నెలల క్రితమే.. పని మానేశారు. అయితే ఎమ్మెల్సీ కొట్టడం వల్లే సుబ్రమణ్యం చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు.