Tuesday, May 13, 2025
- Advertisement -

రాజుగారి వింత నిర్ణ‌యం…షాక్‌లో ప్ర‌జ‌లు

- Advertisement -

థాయ్‌లాండ్‌ రాజు మహా వజిరాలాంకోర్న్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దీంతో థాయ్ ప్ర‌జ‌లు అవాక్క‌య్యారు. త్వరలోనే అధికారికంగా ధాయ్‌లాండ్‌ రాజు పట్టాభిషక్తుడు కానున్న నేపథ్యంలో తన వ్యక్తిగత రక్షణ దళం డిప్యూటీ అధిపతిగా ఉన్న సుతిదా తిజయ్‌(40)ను రాజు బుధవారం పెళ్లి చేసుకున్నారు. ఈ మేరకు రాజభవనం ఒక గెజిట్‌ను విడుదల చేసింది. ఆపై ఆమె పేరును క్వీన్ సుతిదగా మార్చారు. గెజిట్‌లో వారి పెళ్లి ఫొటోలను, వీడియోలను విడుదల చేసింది. థాయ్ మీడియాలో ఈ వార్త ప్రసారం కావడంతో దేశ ప్రజలందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

థాయ్‌లాండ్‌ రాజ్యాంగ బద్ధమైన చక్రవర్తిగా 70 ఏళ్లపాట సింహాసనం అధిష్టించిన తండ్రి భూమిబోల్‌ అదుల్‌యదెజ్‌ 2016 అక్టోబర్‌లో మరణించడంతో ఆయన వారసుడిగా కింగ్‌ రామX పేరొందిన వజిరాలాంకోర్న్‌ పగ్గాలు చేపట్టారు. వచ్చే శనివారం బ్యాంకాక్‌లో బౌద్ధ, బ్రాహ్మణ సంప్రదాయ వేడుకల ప్రకారం ఆయన థాయ్‌లాండ్‌ రాజుగా పట్టాభిషేకం జరగనుంది.

ఇప్ప‌టికే వజిరాలాంకోర్న్ కు మూడు వివాహాలు జరగగా.. ఏడుగురు సంతానం ఉన్నారు. ఆ ముగ్గురితోనూ ఆయన విడాకులు తీసుకున్నారు. మరోవైపు థాయ్ ఎయిర్‌వేస్‌లో ఫ్లయిట్ అటెండెంట్‌గా పనిచేస్తోన్న సుతిదను వజిరలోంగ్ 2014లో తన బాడీగార్డుల్లో డిప్యూటీ కమాండెంట్‌గా నియమించుకున్నారు ఇప్పుడు ఆమెనె పెళ్లి చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -