- Advertisement -
ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండవ సారి భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న మోదీకి అమెరికా అధ్యక్షుడ ట్రంప్ శుభ వార్త అందించారు. అగ్ర రాజ్యం అమెరికా తాజాగా కరెన్సీ పర్యవేక్షిత జాబితా నుంచి భారత్కు తొలగించింది.భారత్ ప్రభుత్వం పలు ప్రధాన సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలు సహా పలు ఇతర పరిణామాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా స్పష్టం చేసింది.
కరెన్సీ మానిటరింగ్ లిస్ట్ లో చైనా, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఇటలీ, ఐర్లండ్, సింగపూర్, మలేషియా, వియత్నాంలు ఈ జాబితాలో కొనసాగుతున్నాయి. ఇండియాను కరెన్సీ పర్యవేక్షిత జాబితా నుంచి తొలగించామని అమెరికా ఆర్థిక శాఖ పేర్కొంది. భారత్ మూడు అర్హతల్లో ఒకదానిని సాధించిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తన తాజా పాక్షిక వార్షిక నివేదికలో తెలిపింది