ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ శాఖలపై సమీక్ష నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈనెల 7న కేబినేట్ను ప్రకటించేందుకు జగన్ సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే కేబినేట్పై ఒక అంచనాకు వచ్చిన సీఎం ఎమ్మేల్యేల అందరితో చర్చించి కేబినేట్ను ప్రకటించనున్నారు.మరోవైపు ఈ నెల 12వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి ముందు ఈ నెల 10వ తేదీన తొలి మంత్రివర్గ సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది.
ఈ నెల 10న సమావేశం కానున్న కేబినెట్… అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై, తమకు అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పే విషయమై.. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందనే దానిపై స్పష్టత ఇవ్వడంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్ను సభ్యులు ఎన్నుకోనున్నారు.