‘కొత్తబంగారు లోకం’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్వేతాబసు ప్రసాద్ ఆ తర్వాత పెద్దగా ఆఫర్స్ రాకపోవడంతో సెక్స్ రాకెట్ కేసులో పట్టుబడిన ఏపీసోడ్ టాలీవుడ్ లో సంచనలం సృష్టించిన విషయం తెలిసిందే. హీరోయిన్ ఇలా సెక్స్ రాకెట్ లో ఇరుక్కోవడం అందరిని షాక్ చేసింది. అయితే ఈ కేసు నుంచి బయటపడిన ఈమె మాత్రం బయట కనిపించడం మానేసింది.
ఓ చిత్రంలో ఐటమ్ సాంగ్, ఓ సినీ కార్యక్రమంలో ఓ పాటకి చిందేయడం తప్ప మళ్లీ కనిపించలేదు. ఆమె గుట్టుగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కార్యాలయంలో శ్వేతాబసు స్క్రిప్ట్ కన్స ల్టెంట్గా పని చేస్తున్నారని చెప్పుకొన్నారు. అయితే, తాజాగా ఆమె కొత్త యవ్వారం బయటపడింది. చిన్న సినిమాల దర్శకుడు రోహిత్ మిట్టల్తో శ్వేతా డేటింగ్ లో ఉందట.
వీరిద్దరు క్లోజ్ గా తీసుకున్న సెల్ఫీలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. సెక్స్ రాకెట్ ఛాయలు ఇంకా చెరిగిపోకముందే.. శ్వేతా కొత్త యవ్వారం మొదలెట్టిందనే గుసగుసలు వినబడుతున్నాయి. మరి ఈ కొత్త యవ్వారం ఏటువైపు వెలుతుందో చూడాలి.
Related