Sunday, May 5, 2024
- Advertisement -

మాజీ సీఎం చంద్ర‌బాబు ఎస్కార్ట్ వాహ‌నానికి ప్ర‌మాదం…పోలీసుల‌కు తీవ్ర‌గాయాలు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎస్కార్ట్‌గా వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. వారిని దగ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే చంద్రబాబు నాయుడు ఈరోజు బుధవారం అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆయనకు కాన్వాయ్‌లో పోలీస్ ఎస్కార్ట్ వాహనాన్ని ఏర్పాటుచేశారు. చంద్రబాబు పర్యటన పూర్తిచేసుకుని వెళుతున్న సమయంలో పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లి సమీపంలోగల నేషనల్ హైవేపై ఎస్కార్టు వాహనం బోల్తా పడింది.

వాహనంలో ఉన్న ఎస్‌ఐ రామాంజనేయులు, ఏఆర్‌ సీసీ విజయ్‌కుమార్‌ తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే అలర్ట్ అయిన ఇతర సిబ్బంది గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు వైద్య సిబ్బంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -