Sunday, May 5, 2024
- Advertisement -

జ‌గ‌న్ ఆ పని చేసింటే ఎప్పుడో సీఎం అయ్యేవాడు….జేసీ

- Advertisement -

టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. జ‌గ‌న్ మీద సంచ‌ల‌న కామెంట్స్ చేస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంటారు. జ‌గ‌న్‌ను ఎప్పుడు పొగుడుతాడో… బాబును ఎప్పుడు తిడ‌తాడో ఆయ‌నకే తెలియ‌దు. తాజాగా మ‌రో సారి మాజ‌గ‌న్‌…మాజ‌గ‌న్ అంటూనే జ‌గ‌న్‌కు సుతి మెత్త‌గా చుర‌క‌లింటించారు.

అనంతపురంలో జరిగిన ధర్మపోరాట దీక్ష సభలో ఆయన జ‌గ‌న్‌పై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. మా వాడు జగన్ కు ఎంత బుద్ధి ఉందో మీకు తెలుసు! బుద్ధీ లేదు పాడూ లేదు! ఒక్క అడుగు ముందుకేసీ చూసి ఉంటే ఎప్పుడో ముఖ్యమంత్రి అయి ఉండేవాడు.. ఆ యోగం లేదు’ అని జోస్యం చెప్పారు.

కులం పేరుతో జగన్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్నాడని జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. ఒక్క కులం మద్దతు కారణంగానే మీరు ముఖ్యమంత్రి అయ్యారా అని చంద్రబాబునాయుడును ప్రశ్నించారు. హిందూపురం లో నవీన్ నిశ్చల్‌ను టిక్కెట్టు కోసం రూ. 10 కోట్లను జగన్ అడిగారని చెప్పారు. మీ భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని జేసీ కోరారు.

వైసీపీ చీఫ్ జగన్‌కు కాస్త తిక్క ఎక్కువని జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు.మోడీ ఎల్లకాలం ప్రధానిగా ఉండాలనే కుట్ర జరుగుతోందన్నారు. ఈ కుట్రను భగ్నం చేయడంలో చంద్రబాబునాయుడు సక్సెస్ అయ్యారని చెప్పారు.చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తే కనుక ప్రజలు తమ గుండెలపై చేయి వేసుకుని ‘హాయి’గా నిద్రపోవచ్చు, వేరే వ్యక్తి ఎవరైనా సీఎం అయితే బెంగళూరుకో, మరెక్కడికన్నానో పోయి పనులు చేసుకోవాల్సిందేనని సెటైర్లు విసిరారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -