కర్నాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అంతా సిద్ధం. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణప్రభుత్వం కూలిపోవడంతో భాజాపా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దం అయ్యింది. రెండు రోజులుగా సీఎం గా యడ్యూరప్ప లేకుండా వేరె వారిని నియమిస్తారనె వార్తలు వచ్చిన సంగతి తెలిసందే. అయితే తాజాగా సీఎంగా యడ్యూరప్పకు లైన్ క్లియర్ అయ్యింది. వేస్తోంది. కొద్దిసేపటి క్రితం సీనియర్ నేత యడ్యూరప్ప.. కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీని ఆయన ఆహ్వానించారు.
అయితే మధ్యాహ్నమే సీఎంగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉన్నా గవర్నర్ సూచన మేరకు సాయంత్రం 6 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతకముందే ఇవాళ సాయంత్రం 4 గంటలకు యడ్యూరప్ప పేరును బీజేపీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించనుంది. ప్రమాణస్వీకారానికి ముందు యడ్యూరప్ప హనుమాన్ దేవాలయంలో పూజలు చేయనున్నారు. ఇవాళ యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.