భారత పేసర్ భూవనేశ్వర్ కుమార్ స్వింగ్ బౌలింగ్ అద్భుతంగా చేస్తాడు. 2012లో ఎంట్రీ ఇచ్చిన భూవి.. తన స్వింగ్ బౌలింగ్తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్ డెలివరీలతో బ్యాట్స్మెన్ పనిపట్టేవాడు.
అయితే బంతి పాతపడే కొద్ది తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని, ఈక్రమంలోనే తన బౌలింగ్లో పేస్ పెంచుకోవాలని భావించానని స్పష్టం చేశాడు. బౌలింగ్ స్పీడ్ పెరిగాక ఒకట్రెండ్ సిరీస్ల్లో ఇబ్బందులు పడినట్లు తెలిపాడు. తన బాడీలో ఎక్ట్స్రా భారం పడినట్లు అనిపించిందని అన్నాడు. అయితే కాలం గడిచేకొద్ది.. అన్ని సర్దుకున్నాయని తెలిపాడు. భువీని ప్రస్తుతం డెత్ ఓవర్ల స్పెషలిస్టుగాను పరిగణిస్తున్నారు.
ఇంకోవైపు గత రెండేళ్లుగా గాయాలతో ఇబ్బంది పడిన భువనేశ్వర్ రీ ఎంట్రీ కోసం వేచి చూస్తున్నాడు. నిజానికి ఈ నెలలో జరగాల్సిన భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్కు తాను ఎంపికయ్యాడు. అయితే కరోనా కారణంగా ఈ సిరీస్ రద్దు అయింది. ఇక ఐపీఎల్ ను కూడా ఈ నెల 29 నుంచి వచ్చేనెల 15 వరకు వాయిదా వేసిన విషయం తెలిసిందే.