Thursday, May 16, 2024
- Advertisement -

చరణ్ ఆ వ్యూహంతో వంద కోట్ల వసూళ్లకు స్కెచ్ వేశాడు!

- Advertisement -

ఇప్పటికే మెగా ఫ్యామిలీ మండి పోతోంది. తమ పేరుతో ఉన్న రికార్డులను వరసగారెండు సినిమాలు తుడిచేసే సరికి కాక ఎక్కి ఉంది. మగధీర, అత్తారింటికి దారేదీ సినిమాల పేరు మీదున్న రికార్డులను వరసగా బాహుబలి,

శ్రీమంతుడు సినిమాలు సొంతం చేసుకొన్నాయి. పాత రికార్డులను తుడిచి పెట్టి కొత్త రికార్డులను సృష్టించాయి. ఇలాంటి నేపథ్యంలో ఎలాగైనా తిరిగి ఆ రికార్డులను తమ పేరు మీద లిఖించుకోవాలని మెగా ఫ్యామిలీ భావిస్తోంది.

అందుకు తురుపు ముక్కగా రామ్ చరణ్ రాబోతున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో చరణ్ భారీ టార్గెట్లే పెట్టుకొన్నాడు. ఏకంగా వంద కోట్ల రూపాయల మార్కును కూడా రీచ్ కావాలనే లెక్కలేసుకొన్నాడు చెర్రీ. టాలీవుడ్ లో మగధీరతో రికార్డులు సృష్టించిన తనే మళ్లీ కొత్త రికార్డులను సృష్టింఆలని అతడు భావిస్తున్నాడు. మరి వంద కోట్ల రూపాయల వసూళ్లను రీచ్ కావడానికి చెర్రీ వ్యూహాలు చెర్రీకి ఉన్నాయట.

అదెలా అంటే… ఇప్పుడు ఎలాగూ టికెట్ల ధరలు పెరిగాయి. ఈ ధరలకు తోడు ప్రత్యేక షోలో వేయించాలని చెర్రీ అనుకొంటున్నాడట. జిల్లాల వారీగా కూడా ఇలాంటి షోలను వేయడానికి రెడీ అవుతున్నారట. వీటి సాయంతో వసూళ్లు భారీ స్థాయికి వెళతాయని వంద కోట్ల రూపాయల మార్కును రీచ్ అవుతాయని చెర్రీ బ్యాచ్ భావిస్తోందట. మరి అది ఏ మేరకు సాధ్యం అవుతుందో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -