దర్శక ధీరుడు రాజమౌళి భారీ మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలుగా చేస్తున్నారు.ఇంకా కథ సిద్ధం కాకపోయిన రాజమౌళి మీద ఉన్న నమ్మకంతో సినిమాను ఒప్పుకున్నారు రాంచరణ్, ఎన్టీఆర్.ప్రస్తుతం సినిమా కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు రాజమౌళి.ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్తను వెల్లడించారు దానయ్య. తను ఈ సినిమాను వదిలిస్తే 50 కోట్లు ఇస్తానని ఓ బడా నిర్మాత తనకు ఆఫర్ ఇచ్చారని దానయ్య తెలిపారు.అయితే ఆ నిర్మాత ఎవరనేది మాత్రం చెప్పలేదు.ఇటీవలే భరత్ అను నేను సినిమాతో హిట్ కొట్టిన దానయ్య,ప్రస్తుతం రాంచరణ్ -బోయపాటి కాంబినేషన్లో మరో మూవీ తీస్తున్నాడు.బాహుబలి సినిమా తరువాత రాజమౌళి క్రేజ్ ఇండియాతో పాటు ప్రపంచం మొత్తం పెరిగింది.
మల్టీస్టారర్ సినిమా బడ్జెట్ 200 కోట్లు అని తెలుస్తుంది.రాజమౌళితో సినిమా తీస్తే ఏ లెక్కలు వేసుకున్న 500 కోట్లు వస్తాయి.అంటే 300 కోట్లు లాభాలు వస్తాయి.పైగా మెగా -నందమూరి హీరోలు కలిసి తీసే సినిమాను తను ఎందుకు వదులుకుంటానని ఆ బడా నిర్మాతను ఎదురు ప్రశ్నించారని తెలుస్తుంది. పైగా అన్నిటికీ మించి ఇంతటి క్రేజీ మూవీ తీసిన ప్రొడ్యూసర్గా తనకు గుర్తింపు వస్తుందని దానయ్య భావిస్తున్నారు.