Thursday, May 2, 2024
- Advertisement -

సూపర్ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ సిద్దం !

- Advertisement -

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ప్రస్తుతం ‘దంగల్’ మూవీతో vబిజీగా ఉన్నాడు. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఆమిర్ ఏ సినిమా, ఎలాంటి సినిమా తచేయబోతున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఓ హిట్ మూవీకి సీక్వెల్ చేయబోతున్నట్టు వినిపిస్తోంది.

దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన ‘3 ఇడియట్స్’ మూవీ ఏ రేంజ్‌లో హంగామా చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. 2009లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. దాంతో ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కించే ఆలోచన చేస్తున్నాడట దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ.

ఈ విషయాన్ని ఆమిర్ ఖానే స్వయంగా ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడట. ఆ మధ్య తనని కలసిన రాజ్ కుమార్ ‘3 ఇడియట్స్’ సీక్వెల్ కోసం ఓ మాంచి కథ దొరికిందన్నాడని.. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడం ఖాయమనే హింట్ ఇచ్చాడట ఆమిర్. మరి ‘త్రీ ఇడియట్స్’ సీక్వెల్ పట్టాలెక్కితే ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -