Sunday, May 5, 2024
- Advertisement -

ప‌వ‌న్‌కు హ్యాండ్ ఇచ్చి భాజాపాలో చేరిన‌ మాధవీలత

- Advertisement -

టాలీవుడ్ నటి, నచ్చావులే హీరోయిన్ ప‌వ‌న్ వీరాభిమాని మాధవీలత జ‌న‌సేనుడికి షాక్ ఇచ్చింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, పార్టీ సీనియర్‌ నాయకుడు బండారు దత్తాత్రేయ సమక్షంలో భాజాపా ఖండువా క‌ప్పుకుని అంద‌రికీ షాక్ ఇచ్చిది. మొద‌టి నుంచి ప‌వ‌న్ వీరాభిమాని అయిన మాధ‌వీల‌త అవ‌స‌రం అయితే ప‌వ‌న్‌ను నాలుగో పెళ్లిచేసుకొనేందుకు సిద్ద‌మ‌ని చెప్పిన ఆమె కాషాయ తీర్థం పుచ్చుకుంది.

పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన మాధవీలత ఇప్పుడు బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. కాగా, గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో చెలరేగుతున్న వివాదాలపై కూడా మాధవీలత తరచూ స్పందించారు. ప‌వ‌న్‌, ఆయ‌న త‌ల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌కు వ్య‌తిరేకంగా ఫిల్మ్‌ఛాంబ‌ర్ ముందు మౌన‌దీక్ష చేసిన సంగ‌తి తెలిసిందే. అంతేగాక, పవన్ పార్టీ జనసేన తరపున తాను ప్రచారం కూడా చేస్తానని మాధవీలత సెల‌విచ్చింది.

మాధవీలతకు కాషాయ కండువా కప్పి నేతలు బీజేపీలోకి ఆహ్వానించారు. బీజేపీ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని ఆమె తెలిపారు. రేపటి రోజు కోసం చాలా రోజుల నుంచి వెయిటింగ్’ అంటూ మాధవీలత తన ఫేస్‌బుక్‌లో అకౌంట్లో శుక్రవారం ఓ పోస్టు చేశారు. చివరికి బీజేపీలో చేరి ఆ సస్పెన్స్‌కు తెరదించారు. పవన్‌ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరతారంటూ గ‌తంలో ప్రచారం జరిగింది. కానీ, ఆమె అనూహ్యంగా బీజేపీలో చేరి అభిమానులకు షాక్ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -