టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబుకు ఈ మధ్య వరుస షాక్లు తగులుతున్నాయి. ఇటీవలే మహేశ్ బాబుకు జీఎస్టీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మహేశ్ బాబు మరో విచిత్ర సంఘటనను ఫేస్ చేశాడు. మహేశ్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా ‘మహర్షి’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సమ్మర్ విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకోంటుంది. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ను విదేశాలలో ప్లాన్ చేశాడు చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి. అయితే షూటింగ్ వెళ్లడం కోసం మహేశ్ ఎయిర్పోర్ట్కు చేరుకోగా, అక్కడ మహేశ్ను ఎయిర్పోర్ట్ సిబ్బంది అడ్డుకున్నారట. నేను సినిమా షూటింగ్ కోసం అర్జెంట్గా వెళ్లాలి అని చెప్పిన మహేశ్ మాట వినిపించుకోలేదట ఎయిర్పోర్ట్ సిబ్బంది.
తన దగ్గర అన్ని అనుమతులూ ఉన్నాయి అని ప్రిన్స్ తెలిపినా ఒప్పుకోలేదట అధికార వర్గాలు. దీనికి కారణం ఇటీవలే భారత జవాన్లపై ఇటీవల పాకిస్థాన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఉగ్రవాదులు ఫ్లైట్స్ను టార్గెట్ చేసుకున్నారని సమాచారం అందడంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది ఇలా వ్యవహారించారని తరువాత తెలిసింది. ఢిల్లీ నుంచి ఆదేశాలు ఇవ్వకుండా విమాన రాకపోకలను సాగించవద్దు అంటూ తేల్చి చెప్పేశారు. అయితే ఈ కారణం చేతనే మహేశ్ను ఆపేశారట మన ఎయిర్ పోర్ట్ అధికారులు.
- Advertisement -
మహేశ్ బాబుకు షాకిచ్చిన ఎయిర్పోర్ట్ సిబ్బంది
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -