- Advertisement -
అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి రెండు సినిమాలు నిరాశకు గురి చేశాయి. అఖిల్ మొదటి సినిమా డిజాస్టర్ కాగా, రెండో సినిమా హలోతో ఫర్వాలేదనిపించుకున్నాడు. ఈ రెండు సినిమాలు అనుకున్నంత విజయం సాధించకపోవడంతో కాస్తా గ్యాప్ తీసుకుని మిస్టర్ మజ్ను సినిమాలో నటించాడు. ఈ సినిమాకు తొలిప్రేమతో డిసెంట్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆప్టేడ్ను విడుదల చేశారు. సినిమాకు సంబందించిన టైటిల్ ట్రాక్ ను రేపు సాయత్రం ఆరు గంటలకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది మిస్టర్ మజ్ను. ఈ సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఈ సినిమాకు తనకు హిట్ ఇస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు అఖిల్.