‘అందాల రాక్షసి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో రాహుల్ రవీంద్రన్. కాని ఈ సినిమా తరువాత మనోడికి సరైన హిట్లు లేక ‘టైగర్’, ‘శ్రీమంతుడు’ లాంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాడు. హీరోగా అవకాశాలు తగ్గడంతో డైరెక్టర్గా మారి అక్కినేని హీరో సుశాంత్ తో ‘చి ల సౌ’ చి అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్కు మంచి రెస్పన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.
అయితే తాజాగా రాహుల్ రవీంద్రన్ సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రాహుల్తో సినిమా తీయడానికి సీనియర్ హీరో నాగర్జున రెడీగా ఉన్నాడని సమాచారం. అయితే రాహుల్ దర్శకత్వంలో హీరోగా కాకుండా నిర్మాతగా వ్యవహరించాలని నాగర్జున డిసైడ్ అయ్యాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని రాహుల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మరి రాహుల్ తీసే సినిమాలో హీరో,హీరోయిన్లు త్వరలోనే తెలియజేస్తానని రాహుల్ తన ట్విట్టర్లో తెలిపాడు.