షూటింగ్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ విషయం బాలీవుడ్ వాళ్లకు బాగా తెలుసు. ఇటీవల వరుసగా సినీ నటీనటులు గాయపడుతున్నారు. మూడు నెలల్లో ముగ్గురుకి గాయలయ్యాయి. వారిలో ఇప్పుడు అందాల తార అలియాభట్ చేరింది.
ప్రస్తుతం హీరో రణ్బీర్ కపూర్తో కలిసి అలియా నటిస్తున్న సినిమా ‘బ్రహ్మస్త్ర’. ఈ సినిమా షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. అయితే మంగళవారం ఉదయం షూటింగ్లో పాల్గొంటున్న ఆలియా గాయపడినట్టు సమాచారం. గాయ కావడంతో అలియాకు 15 రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమె ముంబైకి వచ్చేసింది.
హీరో రణ్బీర్ కపూర్తో దర్శకుడు ఆర్యన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ సినిమాలో అలియాభట్ హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా బల్గేరియాలో చేస్తున్నారు. అలియా భట్పై ఓ సీన్ తీస్తుండగా ఆమె ఎత్తు నుంచి కిందపడింది. కిందపడడంతో కుడి భుజం, మోచేతికి గాయాలయ్యాయి. మోచేతి వద్ద చీలిక ఉన్నట్టు ఎక్స్రేలో తేలడంతో వైద్యులు ఆమెను విశ్రాంతి తీసుకోమని సూచించడంతో ముంబైకి వచ్చేసింది.
నొప్పితో బాధపడుతున్న అలియాకు కుడిచేతికి కట్టు కట్టారు. 15 రోజుల పాటు భుజాన్ని కదపడానికి కూడా వీలు లేదని వైద్యులు చెప్పారు. విశ్రాంతి అనంతరం ఏప్రిల్ మొదటివారంలో మళ్లీ అలియా బల్గేరియాకు వెళ్లే అవకాశం ఉంది. ‘బ్రహ్మస్త్ర’ సినిమాను అడ్వెంచర్ ఫాంటసీగా ఆయన్ ముఖర్జీ రూపొందిస్తుండగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్కూ నటిస్తున్నారు. ఈ సినిమా 2019 ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని ప్లాన్.