టాలీవుడ్ సీనియర్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ మరో మల్టీస్టారర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.ఇప్పటికే వరుస మల్టీస్టారర్ల సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉన్నాడు వెంకీ.మెగా ప్రీన్స్ వరుణ్ తేజ్తో కలిసి ఎఫ్-2 అనే సినిమా చేస్తున్నాడు.దీంతో పాటు తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీ మామ అనే సినిమాను లైన్లో పెట్టాడు.ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే తాజాగా వెంకీ మరో మల్టీస్టారర్ మూవీని ఓకే చేసినట్లుగా తెలుస్తుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి.
కథ పరంగా ఈ సినిమాలో మరో హీరో కూడా ఉండాల్సి రావడంతో ,వెంకటేశ్ అయితే బాగుంటుందని ,ఆలోచించి వెంకీని సెలెక్ట్ చేశారట.త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా అరవింద సమేత సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా దసరాకు విడుదల కానుంది.ఈ సినిమా పూర్తి అవ్వగానే వెంకీ-బన్నీ మల్టీస్టారర్ మూవీ మొదలు పెడతాడు త్రివిక్రమ్.బన్నీ కూడా నా పేరు సూర్య తరువాత ఇప్పటి వరుకు మరో సినిమా అంగీకరించలేదు.దీంతో త్రివిక్రమ్తో సినిమా ఖచ్చితంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.