Tuesday, April 30, 2024
- Advertisement -

ఆ టెన్షన్ ను పక్కనపెట్టి ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్!

- Advertisement -

ఒకవైపు ‘సన్నాఫ్ సత్యమూర్తి” వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. భారీ స్థాయి అంచనాలతో.. భారీ బడ్జెట్ తో.. భారీ రేట్లకు అమ్ముడు పోయిన ఈ సినిమా బయ్యర్లను ఇంకా ఒక ఒడ్డుకుపడేయలేదు.  

ఈ హీరో సినిమాకు ఈ రోజుల్లో కూడా కొంత లాంగ్ రన్ ఉంటుంది.. కాబట్టి భారీ ధరలను పెట్టేశారు బయ్యర్లు. అయితే ‘రేసుగర్రం’ సినిమా విషయంలో అది వర్కవుట్ అయ్యింది.. బయ్యర్లు బాగుపడ్డారు. 

ఆ సినిమా కోట్ల రూపాయలను వసూలు చేసింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ విషయంలో కూడా కొనుగోలు దారులవి అవే ఆశలే. అయితే ఈ సారి మాత్రం ‘రేసుగుర్రం’ స్థాయి కనిపించడం లేదు. ఈ సినిమా కు మొదట్లోనే డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ త్రివిక్రమ్ మార్కు.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే ట్యాగ్ సినిమాను నడిపిస్తోంది.

ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ దశకు రాలేదు. అంటే పెట్టిన పెట్టబడిని బయ్యర్లు రాబట్టుకోలేదు. మరి సినిమా సంగతి ఇలా ఉంటే.. అల్లు అర్జున్ మాత్రం సమ్మర్ ను ఇండియాకు దూరంగా గడిపేస్తున్నాడు. భార్య పిల్లలు కుటుంబంతో కలిసి ఆయన యూకే టూర్ కు వెళ్లాడు. ఈ ఎండలకు దూరంగా.. టెన్షన్లకు దూరంగా ఈ హీరో అక్కడ ఫ్యామిలీతో అనందంగా గడిపేస్తున్నాడు. సినిమా విషయంలో.. ప్రచారం విషయంలో అలసిపోయిన ఈ హీరో అలా సేదతీరుతున్నాడు.

వెకేషన్ ను పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత అర్జున్ బోయపాటి సినిమా మీద దృష్టి సారించనున్నట్టుగా తెలుస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -