స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వక్కంతం వంశీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య’ పై అంచనాలు భారీగా ఉన్నాయి. త్వరలో ఈ సినిమా ఆడియో వేడుకను జరుపుకోనుంది. మిలటరీ నేపథ్యం, బన్నీ నటన, భారీ యాక్షన్ సీన్స్ వీటన్నింటి దృష్ట్యా సినిమా గ్యారంటీగా హిట్ అవుతుందని అంటున్నారు బన్నీ అభిమానులు. ఈ వేడుకను పశ్చిమ గోదావరి జిల్లాలో చేయలని చిత్ర యూనిట్ భావిస్తుంది. మాధవరం అనే గ్రామంలో జరపాలని నిర్ణయించుకున్నారు. అక్కడే ఎందుకంటే ఈ ఊరులో ఒక్కో కుటుంబం నుంచి ఒకరు ఆర్మీలో ఉన్నారు. అందకే ఈ ఊరుని మిలటరీ మాధవరంఅని అంటారు.
ఈ సినిమాలో బన్నీ ఆర్మీ ఆఫీసర్ కనుక, ఆ గ్రామానికి వెళ్లి మిలటరీ కుటుంబాలను కలవాలనుకున్నారు.అందుకే మిలటరీ గ్రామంలో ఆడియో ఫంక్షన్ను ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.మే 4న ఈ సినిమా రిలీజ్ కానుంది విడుదలకు ముందు ఈ నెల చివర్లో హైద్రాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీగా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.గచ్చిబౌలి ..యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ .. ఎల్బీ స్టేడియం .. ఈ మూడు ప్రదేశాల్లో ఎక్కడ జరపాలనేది కూడా త్వరలో ఖరారు చేయనున్నారు.