అల్లు అర్జున్ తెలుగులో స్టార్ హీరో.మహేశ్,పవన్ అంత క్రేజ్ లేకపోయినప్పటికి తన రేంజ్లో అభిమానులను అలరిస్తున్నాడు బన్నీ. బాక్సాఫీస్ వద్ద మహేశ్,పవన్ సినిమాలకు ఫ్లాప్ టాక్ వస్తే ఆ సినిమాలకు రెండో రోజు నుండో జనాలు కరవు అవుతారు.ఈ సినిమాలకు భారీ నష్టాలు వస్తాయి.కాని బన్నీ సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చిన మినిమమ్ యాభైం కోట్లు కలెక్ట్ చేయడం విశేషం.
సన్నాఫ్,సత్యమూర్తి,దువ్వాడ జగన్నాథమ్,నా పేరు సూర్య,సరైనోడు ఈ సినిమాలన్నిటికి మొదట ఫ్లాప్ టాక్ వచ్చిన తరువాత పుంజుకొని యాభై కోట్లు కలెక్ట్ చేశాయి అంటే బన్నీ రేంజ్ ఏంటో అర్థం చేసుకొవాలి.బన్నీ సినిమాలన్ని నార్త్లోకి డబ్ అవుతుంటాయి.తాజాగా అల్లు అర్జున్ నటించిన సినిమా యూట్యూబ్లో రికార్డు క్రియేట్ చేస్తుంది. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో నటించిన చిత్రం ‘సరైనోడు .ఈ సినిమాను హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేశారు. యూట్యూబ్ లో రెండు కోట్ల మంది ఈ సినిమాను వీక్షించడం విశేషం.భారతీయ చిత్రాల్లో ఇటువంటి ఘనత సాధించిన తొలి సినిమా ‘సరైనోడు’ కావడం విశేషం.
హిందీ వెర్షన్ యూట్యూబ్ హక్కులను గోల్డ్ మైన్స్ టెలీఫిలిమ్స్ సంస్థ దక్కించుకుంది. ఇప్పటికే రెండు కోట్ల వ్యూస్ క్రాస్ చేసిన ఈ సినిమాకు ఆరు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. నార్త్ సైడ్ బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉంది.దీంతో అతని సినిమాలో హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్లోకి విడుదల చేస్తున్నారు.గతంలో బన్నీ సినిమా దదువ్వాడ జగన్నాథమ్ కూడా యూట్యూబ్లో రికార్డులను సృష్టించింది.సల్మాన్,అమీర్ ఖాన్ల సినిమాలకు రాని వ్చూస్ బన్నీ సినిమాకు రావడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.