Monday, May 20, 2024
- Advertisement -

జెండా ఎగరేసిన బన్నీ

- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సరైనోడు’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అల్లు అర్జున్ సరసన రకుల్, కేథరిన్ లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఐతే ఈ సినిమాకి సంబంధించి పాటలను చిత్రికరించడానికి ఈ సినిమా యూనిట్ దక్షిణాఫ్రికాలోని బొలీవియాకు వెళ్లింది.

ఇక్కడ అద్భుతమైన లోకేషన్లలో పాటలను చిత్రికరిస్తున్నారు. ఐతే ఇప్పటి వరకు ఈ లోకేషన్లో ఏ సినిమా షూటింగ్ జరుపుకోలేదు. మొదటగా సరైనోడు షూట్ జరుపుకుంది. ‘సరైనోడు’ టీమ్ బొలీవియాకు వెళ్తున్నప్పటి ఫొటో కొన్ని రోజుల ముందే సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

ఇంతలోనే అక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని.. లొకేషన్ నుంచి ‘సరైనోడు’ టీమ్ అంతా ఫొటోలు దిగి.. వాటిని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అల్లు అర్జున్ ఇండియన్ ఫ్లాగ్ పట్టుకుని యూనిట్ సభ్యులతో కలిసి ఫొటోలకు పోజిచ్చాడు. ఈ పాటల చిత్రికరినతో పాటు దాదాపుగా షూటింగ్ పూర్తియిపోయినట్లే. మిగిత కార్యాక్రమాలన్నీ పూర్తి చేసి  ఏప్రిల్ 22న రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -