మెగా కాంపౌండ్ అంటే చిరంజీవి ఫ్యామిలీ హీరోలతో పాటు అల్లు హీరోలు కూడా. వీళ్లందరినీ కలిపితేనే మెగా హీరోలు అంటారు. ఐతే గత కొంతకాలంగా మెగా హీరోల లిస్ట్ నుంచి అల్లు హీరో బయటకు వచ్చి వేరు కుంపటి పెట్టాడనేది అందరికీ తెలిసిన నిజయే. ఎంతకాలం చిరు నీడలో బతుకుతాం. మనకి కూడా స్టార్ డమ్ వచ్చింది కదా అనే లెక్కలో అల్లు కాంపౌండ్ ఉంది. అందుల్లో వాస్తవం కూడా ఉంది.
ఐతే అల్లు కాంపౌండ్ మెగా వారిని మించిపోయేలా పనులు చేయడం టాలీవుడ్లో హాట్ డిస్కషన్స్ కు కారణం అయింది. ప్రముఖ ఓటీటీ ఆహావారు ఏర్పాటు చేసిన ఆహా 2.0 లాంచ్ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రావడం…మెగావారికి మతులు పోగొట్టేలా చేసింది. నిజానికి ఆహాలో బన్నీని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారనే వంకతో ఆ స్పేస్ ను ఫిల్ చేయడానికి చెర్రీ.. డిస్నీ+ హాట్స్టార్ తో అగ్రిమెంట్లు చేసుకుని తెలుగు వరకు ప్రమోషన్లు షురూ చేశాడు. కాని బన్నీకొస్తున్న క్రేజ్ ను చెర్రీ ఫిల్ చేసుకోలేకపోతున్నాడు.
అల్లు అర్జున్ ను టాప్ స్టార్ ను చేసేపనిలో అల్లు అరవింద్ ఫుల్ బిజీ అయిపోయాడు. దృవతో చెర్రీకి మళ్లీ ఒక హిట్ ఇచ్చి సైడ్ అయిపోయిన అరవింద్…ప్రస్తుతం తన కుమారుడు గ్రోత్ మీదనే ఫోకస్ పెట్టాడు. ఇంతకాలం మెగా పల్లకీ మోసింది చాలు అనుకుని ..ఇప్పుడు తన వారసుడినీ మోయాలని డిసైడ్ అయ్యారు. కాకపోతే ఈ ప్రాసెస్ లో అల్లు కాంపౌండ్ ఎప్పటికీ మెగావారి తొత్తే అనుకోవడం,బానిసలుగా బావించడం విషయంలో మెగా ఫ్యాన్స్ మరొక్కసారి ఆలోచించుకోవడం మంచిది.
టాలీవుడ్ లో నెక్ట్స్ విడాకులు వారిదేనట..!