మైనా అనే చిత్రం ద్వారా వెండితెర అరంగ్రేటం చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి అమలాపాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా ఈమె నాయక్, ఇద్దరమ్మాయిలతో వంటి తదితర చిత్రాలలో నటించి మెప్పించారు. ‘దైవతిరుమగన్’చిత్రంతో పాటు పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు ఏఎల్ విజయ్ తో ఓ సినిమా షూటింగ్ సమయంలో అతనితో ప్రేమలో పడింది.
ఈ విధంగా దర్శకత్వ ప్రేమలో పడిన అమలాపాల్ 2014 సంవత్సరంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పలు మనస్పర్థలు చోటు చేసుకోవడం వల్ల 2017లో ఆ దర్శకుడితో విడాకులు విడాకులు తీసుకుని స్వేచ్ఛాగా జీవిస్తున్నారు. విడాకుల తర్వాత అమలాపాల్ ఎక్కువగా గ్లామర్ పాత్రలు ఉన్న సినిమాల్లోనే నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
Also read:ఈ ఉప్పు తింటే బీపీ పేషెంట్స్ కు మంచిది..?
తాజాగా ఈ నటి ఓ వ్యక్తి తొడపై కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నటువంటి ఒక ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్లు ఈమె మరోసారి ప్రేమలో పడినట్లు ఉందని పెద్దఎత్తున కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే అమలాపాల్ స్పందిస్తూ…అతను నా ప్రియుడు కాదు మా అన్న అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఫోటో పై అమలాపాల్ క్లారిటీ ఇవ్వడంతో నెటిజన్లు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..