Wednesday, April 24, 2024
- Advertisement -

రంగ‌మ్మ‌త్త‌కు మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌

- Advertisement -

రంగ‌స్థ‌లం సినిమా త‌రువాత అనసూయ‌కు సినిమాల‌లో అవ‌కాశాలు పెరుగుతున్నాయి.మొన్నటి వ‌రుకు బుల్లీతెరలో ఫుల్ క్రేజ్ ఉన్న అన‌సూయ ఇప్పుడు వెండితెర మీద కూడా త‌న హ‌వాను చూపించాల‌ని కొరుకుంటుంది. క్ష‌ణం సినిమాలో ఆమె న‌ట‌న‌కు మంచి పేరు వ‌చ్చింది. ఇప్పుడు ‘రంగమ్మత్తస‌గా చేసిన ర‌చ్చ మామూలుగా లేదు. ఈ సినిమాలో రాంచ‌ర‌ణ్ త‌రువాత మంచి పేరు వచ్చింది అన‌సూయ‌కే. ఈ సినిమా త‌రువాత వ‌రుస సినిమాలు చేస్తుంది.

ఇప్పుడ మ‌రో క్రేజీ  ఆఫ‌ర్‌లో యాక్ట్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అనిల్ రావిపూడి సినిమాలో ఒక కీలకమైన రోల్ దక్కిందని సమాచారం. ఈ పాత్ర ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. వెంకటేశ్ .. వరుణ్ హీరోలుగా మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో అన‌సూయ ప్ర‌త్యేక రోల్‌లో చేస్తుందని స‌మాచారం.ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ ను తీసుకున్నారు. మరో కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ‘ఎఫ్ 2’ అనే టైటిల్ ను ఖరారు చేశారు చిత్ర యూనిట్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -