దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. కరోనా సెలబ్రెటీల పాలిట శాపంగా మారుతుంది. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు కరోనా రావడం కొంత మంది చనిపోవడం కూడా జరిగింది. ఇప్పటికే రామ్ చరణ్, వరుణ్ తేజ్, తమన్నా, రకుల్ కోవిడ్ బారినపడ్డారు. తాజాగా జబర్ధస్త్ యాంకర్ అనసూయకు కూడా కరోనా సోకినట్టు ఉంది.
కాగా ఈ విషయాన్ని అనసూయే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. తనలో కోవిడ్ లక్షణాలు ఉన్నాయని ఆ ట్వీట్ లో రాసుకొచ్చింది. ఈరోజు ఉదయం కర్నూల్ లో ఒక ప్రోగ్రామ్ కోసం వెళుతుంటే తనకు కరోనా లక్షణాలు ఉన్నట్టు అనిపించిందని పేర్కొంది. దాంతో ఆ ప్రోగ్రామ్ ను క్యాన్సిల్ చేసినట్టు తెలిపింది.
ఇటీవలి కాలంలో నన్ను కలిసిన వాళ్లు కూడా ఓ సారి టెస్ట్ చేయించుకోండి. నా రిపోర్ట్ ఏంటనేది మీకు తెలియజేస్తాను. అందరు జాగ్రత్త’’ అని అనసూయ తన ట్వీట్లో పేర్కొంది. కాగా కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ అనే చిత్రం కూడా అనసూచ నటిస్తోంది. మరోవైపు నిహారికతో కలిసి వెబ్ సిరీస్ కూడా చేస్తోంది.