బిగ్ బాస్ సెకండ్ సీజన్ 10 వారాలు కంప్లీట్ చేసుకోగా ఈమధ్య ఆడియెన్స్ కూడా ఈ షోని బాగా చూస్తున్నట్టు తెలుస్తుంది. ప్రతి వారం 10 కోట్లు తగ్గకుండా ఓట్లు వస్తున్నాయి అంటే బిగ్ బాస్ సెకండ్ సీజన్ కూడా సూపర్ సక్సెస్ అయినట్టే. ఇక షోని సక్సెస్ ఫుల్ గా రన్ చేసేందుకు నిర్వాహకులు తెగ కష్టపడుతున్నారు.
ఈ క్రమంలో భాగంగా నిన్న హౌజ్ లోకి బుల్లితెర యాంకర్ అనసూయని సర్ ప్రైజ్ ఎంట్రీ ఇప్పించారు. గెస్ట్ గా అనసూయ సడెన్ ఎంట్రీ ఇచ్చింది.రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్తో పేక్ష్రక హృదయాలను కొల్లగొట్టిన యాంకర్ అనసూయ బిగ్బాస్లో సందడి చేసింది.ఇప్పటికే బిగ్ బాస్ హౌజ్ మెట్స్ అందరికి కళ్యాణ వైభోగమే టాస్క్ ఇచ్చాడు. ఈ కార్యక్రమానికి అనసూయ అతిథిగా హాజరయింది. గ్రీన్ కలర్ శారీతో ప్రేక్షకులతోపాటు బిగ్హౌస్ సభ్యుల మనసులు కొల్లగొట్టింది. 73వ ఎపిసోడ్లో భాగంగా బిగ్హౌస్ని పెళ్లి ఇల్లుగా మార్చేశారు. రాధాకృష్ణ, మధులత గ్రూప్ లు వధూవరుల తరపున ప్రాతినిధ్యం వహించగా మంగళవారం మెహందీ కార్యరక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాట్ యాంకర్ అనసూయ హాజరుకావడం మరింత ‘షో’ చేకూరింది. పురోహితుడుగా గణేష్ వ్యవహరించారు. టాస్క్లో భాగంగా పలు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. తొలుత బిగ్బాస్ అబ్బాయి తరపున వాళ్లకు టాస్క్ ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్లో ఉంగరాలు వెతికితీయాలన్నారు. సామ్రాట్, దీప్తిలు ఈ టాస్క్ పూర్తి చేశారు.ఇంట్లో ఓపక్క ఇలా హంగామా నడుస్తుండగా బిగ్హౌస్లో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ పాట వినిపించడంతో సభ్యుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అదే సమయంలో అనసూయ తాంబూలంతో ఎంట్రీ ఇచ్చింది. హౌస్లో అందరినీ పేరుపేరునా పలకరించింది. బిగ్బాస్కి మరింత శోభ చేకూర్చేందుకు వచ్చినట్లు చెప్పింది. వధూవరుల్లో ఎవరి తరపున ఉంటారని సభ్యులు ప్రశ్నించగా తనకు ఇద్దరూ కొడుకులే కావున వధువు తరపునే ఉంటానని చెప్పి నవ్వులు పూయించింది. బుధవారం జరగనున్న సంగీత్, పెళ్లి వేడుకల్లో రంగమ్మత్త ఇంకెంత సందడి చేస్తుందో చూడాలి.
10 వారాలు పూర్తి చేసుకున్నారు కాబట్టి ఈ వారం ఎలిమినేషన్స్ లో ఇద్దరు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. 4 వారాల్లో ఇద్దరు చొప్పున వెళ్తే ఫైనల్ గా 1 టైటిల్ విన్నర్ అవుతారు. మరి ఈ వారం నాని ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారా అన్నది చూడాలి.