Saturday, May 4, 2024
- Advertisement -

‘జ‌బ‌ర్థ‌స్త్’ నుంచి అన‌సూయ అవుట్‌

- Advertisement -

ప్ర‌ముఖ ఈటీవీ ఛానెల్లో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్థ‌స్త్ ప్రోగ్రామ్‌కు ఎలాంటి ఆద‌ర‌ణ ఉందో అంద‌రికి తెలిసిందే.టెలివిజ‌న్ రంగంలో సంచ‌ల‌న రేటింగ్స్ సాధించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది జ‌బ‌ర్థ‌స్త్ .అయితే రాను రాను ఈ షో నుంచి ప‌లువురు దూరం అవుతున్నారు.ఇప్ప‌టికే చాలామంది షో నుంచి బ‌య‌టికి వెళ్లిపోయారు.తాజాగా జ‌బ‌ర్థ‌స్త్ ద్వారా త‌న‌కంటూ ప్రత్యేక స్థానం ఏర్ప‌రుచుకున్న యాంక‌ర్ అనసూయ కూడా ఈ షో నుంచి త‌ప్పుకుంది.వ‌చ్చే వారం నుంచి జ‌బ‌ర్థ‌స్త్ యాంక‌ర్‌గా ఢీ యాంక‌ర్ వ‌ర్షిణి క‌నిపించ‌నుంది.ఈ విష‌యాన్ని వ‌చ్చే వారం ప్రొమో ద్వారా చూపించారు కూడా.

అయితే ఇంత స‌డ‌న్‌గా అన‌సూయ ఎందుకు త‌ప్పుకోవాల్సి వ‌చ్చిందో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు.జ‌బ‌ర్థ‌స్త్ సెట్‌లో గ్రూపు రాజకీయాలు ఎక్కువ అని ,ఒక వ‌ర్గానికి చెందిన వారికే ప్రాధాన్య‌త ఉంటుంద‌ని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే.దీని కార‌ణంగానే అన‌సూయ షో నుంచి త‌ప్పుకుంద‌ని తెలుస్తుంది.పైకి రెండు వారాలే అని బిల్డ‌ప్ ఇస్తున్నజ‌బ‌ర్థ‌స్త్ యాజ‌మాన్యం అస‌లు మ్యాట‌ర్‌ను ఎప్పుడు బ‌య‌ట‌పెడుతుందో చూడాలి.ఏది ఏమైన‌ప్ప‌టికి అన‌సూయ త‌ప్పుకోవ‌డం వ‌ల్ల వ‌ర్షిణికి మాత్రం ల‌క్కీ ఛాన్స్ కొట్టేసింద‌ని అనుకుంటున్నారు ప్రేక్ష‌కులు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -