Thursday, April 25, 2024
- Advertisement -

బంపర్ ఆఫర్ కొట్టేసిన జబర్దస్త్ బ్యూటీ రష్మి

- Advertisement -

ప్రభాస్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్. కె.కె. రాధా క్రిష్ట కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రిష్టం రాజు సమర్పణలో వంశీ ప్రమోద్, ప్రసీద చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కాగా ఈనెల 23 న రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకను ప్రత్యేకంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తన అభిమానులనే ప్రభాస్ ఆహ్వానించనున్నారు. ఇందుకోసం దాదాపు 50 వేలమంది అభిమానులు కార్యక్రమానికి రానున్నారని సమాచారం. ఐదు భాషల్లో ని సినిమా ట్రైలర్స్ ను ప్రభాస్ తన అభిమానుల చేతుల మీదుగా విడుదల చేయనున్నారన్న విషయం తెలిసిందే.

కాగా ఇప్పటి వరకు ఏ ప్రముఖ హీరో ఈవెంట్ జరిగినా యాంకర్ గా సుమ ఉండాల్సిందే కానీ రాధేశ్యామ్ ఈవెంట్ కు మాత్రం సుమను పక్కకు పెట్టినట్టు సమాచారం. సుమ స్థానంలో రష్మి యాంకరింగ్ చేయనుంది. కారణం ఏదైనా తనకు వచ్చిన ఈ అరుదైన అవకాశానికి రష్మి సంబరపడిపోతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ తో జరిగే ఈవెంట్ కోసం ఎంతో ఎగ్జైంటింగ్ గా ఎదురు చూస్తున్నానని రష్మి తెలిపింది.

ప్రభాస్ వదులుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

టాలీవుడ్ హీరోల పెళ్లిలు, ఖర్చు, కట్నాలు..!

టాలీవుడ్ లో సూపర్ హిట్ జోడీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -