Sunday, May 12, 2024
- Advertisement -

బాల‌య్య‌ను సెట్ చేసిన ‘దిల్’ రాజు

- Advertisement -

ఇండ‌స్ట్రీలో యువ ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హించ‌డంలో ‘దిల్’ రాజు ముందుంటాడు.ఇలాగా చాలా మంది ద‌ర్శ‌కుల‌ను ప‌రిచియం చేశాడు.అందుకే ఆయ‌న‌తో ప‌ని చేసిన ద‌ర్శ‌కులు మ‌ళ్లీ ఆయ‌న‌తోనే ప‌ని చేయ‌డానికి ఆశ‌క్తి చూపిస్తారు. అనిల్ రావిపూడి ఈ యువ ద‌ర్శ‌కుడు చేసిన మూడు సినిమాలు హిట్టే .ఆ మూడు సినిమాలు కూడా దిల్ రాజు ప్రోడ‌క్ష‌న్‌లో వ‌చ్చిన‌వే కావ‌డం విశేషం.ఇప్పుడు అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేష‌న్‌కి తెర‌దించాడు.

ఎన్నడూ ఊహించని కాంబినేషన్ ఇప్పుడు టాలీవుడ్ లో సెట్ కాబోతోందట. కధ దగ్గర నుంచి రిలీజ్ అయ్యి థియేటర్స్ నుంచి సినిమాకు వీడుకోలు పలికేదాకా అన్నీ దగ్గరుండి చూసుకోవడం నిర్మాత దిల్ రాజుకు అలవాటు. ఇక నటసింహం బాలయ్య పెద్దగా లెక్కలు వేసుకోకుండా మనసుకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తారని ఇప్పటిదాకా కనీసం ఓ రూమర్ కూడా పుట్టలేదు. అందుకు కారణం ఇద్దరి రుచులలో వున్న తేడా. కానీ ఊహకే రాని ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ వెరైటీ కాంబినేషన్ సెట్ చేయడానికి ఓ కుర్ర డైరెక్టర్ కారణం అంటున్నారు.

కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమా చేసి ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ సినిమా హిట్ అయ్యాక ఎన్టీఆర్ , బాలయ్య కు అనిల్ కధలు కూడా చెప్పాడు. ఎన్టీఆర్ కి చెప్పిన కథతో ఇటీవల రవితేజ తో రాజా ది గ్రేట్ సినిమా తీసాడు. ఇక ఎన్టీఆర్ టైటిల్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ వున్న ఓ కధని అప్పట్లో బాలయ్యకు వినిపించాడట అనిల్ . అయితే అది పట్టాలు ఎక్కలేదు. ఇక తాజాగా బోయపాటి లేదా ఎస్.వి. కృష్ణారెడ్డి తో బాలయ్య నెక్స్ట్ సినిమా ఉంటుందనుకుంటున్న టైం లో హఠాత్తుగా సీన్ లోకి అనిల్ రావిపూడి వచ్చాడు. అతను చెప్పిన కథ ఇటు బాలయ్యకు అటు దిల్ రాజుకు నచ్చిందట. దిల్ రాజు బ్యానర్ లో వరస సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి ఈ సినిమా కూడా అదే బ్యానర్ లో చేద్దాం అనగానే బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రావచ్చు అంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -