టాలీవుడ్ జేజెమ్మ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్లుక్ను చిత్రబృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఫస్ట్లుక్ను చూస్తుంటే స్వీటీ మూగ అమ్మాయిగా నటించబోతుంది అని అర్థం అవుతుంది. ఎందుకంటే నిశ్శబ్దం టైటిల్ కింద “సాక్షి ఎ మ్యూట్ ఆర్టిస్ట్” అని టాగ్ ఉంది. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన రెండు పోస్టర్లు ఆసక్తి పెంచేస్తున్నాయి. మొదటి పోస్టర్ లో చేతులతో “నిశ్శబ్దం” అనే టైటిల్ ని కన్వే చేసారు. అనుష్క కనపడుతున్న రెండవ పోస్టర్ లో “సాక్షి ఎ మ్యూట్ ఆర్టిస్ట్” అని టాగ్ ఇస్తూ సినిమా ఓ రేంజ్ లో ఉండబోతోంది అన్న విషయం చెప్పేసారు. షాలిని పాండే, అంజలి, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి కోన ఫిల్మ్ కార్పొరేషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
అనుష్క వెండితెర మీద కనిపించి చాలా రోజులే అయ్యింది. బాహుబలి తర్వాత ప్రమోషన్స్ లో తప్ప ఇంకెక్కడ స్వీటీ కనిపించలేదు. ఈ సినిమా తొందరగా రిలీజ్ అయితే అనుష్క అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. స్వీటీ ఇన్ని రోజులు తన వైట్ లాస్ గురించి బుక్ రాస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.