దిల్ రాజు…స్టార్ ప్రొడ్యూసర్. నైజాం స్టార్ డిస్ట్రిబ్యూటర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ డిస్ట్రిబ్యూషన్లో నైజాం రాజుగా దిల్ రాజు పేరు మార్మోగిపోతోంది. అయితే ఇప్పటివరకు నిర్మాణంపైనే దృష్టి సారించిన దిల్ రాజు మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు.
గతంలో అంజలి నటించిన గీతాంజలి సినిమాలో ఓ గెస్ట్ రోల్లో కనిపించారు దిల్ రాజు. తాజాగా మరోసారి ఆ సినిమాకు సీక్వెల్గా గీతాంజలి మళ్ళి వచ్చింది రాబోతుంది. మొదటి పార్ట్ లో దిల్ రాజు గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడంతో రెండో పార్ట్ లో కూడా చేయాలని దిల్ రాజుని సంప్రదించగా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
నటి అంజలికి ఇది 50వ సినిమా కావడం విశేషం. ఇప్పటికకే రిలీజ్ అయిన టీజర్కి మంచి రెస్పాన్స్ రాగా మార్చ్ 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం దిల్ రాజు…రామ్ చరణ్తో గేమ్ ఛేంజర్తో పాటు శతమానం భవతి సీక్వెల్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలాగే చిన్న సినిమాలను నిర్మించే పనిలో పడ్డారు.