వాలంటైన్స్ డే సందర్భంగా అర్జున్రెడ్డి హీరోయిన్ ఓ గిఫ్ట్ ఇచ్చేసింది. ‘ఎలా నిలిచా కలకలమే చూసే’ అని తన గళం విప్పింది. థియేటర్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలెట్టిన శాలిని పాండే ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో హీరోయిన్గా సూపర్ హిట్ అందుకుంది. ప్రీతి పాత్రలో ఆమె నటకు ఇప్పుడు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఒక్క తెలుగులోనే కాదు తమిళ్, మలయాళంలోనూ అవకాశాలు తెచ్చుకుంటోంది. ఈ సమయంలో శాలిని కొత్త అవతారం ఎత్తింది. గాయనిగా మారి ఓ ఫీల్గుడ్ పాట అందుకుంది.
ప్రేమికుల రోజు ప్రత్యేకం ‘నా ప్రాణమే’ అంటూ ఓ స్పెషల్ వీడియో ఆల్బమ్లో కోసం తన గళం వినిపించింది. పాప్ రాక్ బ్యాండ్ ‘లగోరీ’ కంపోజ్ చేసిన ఈ పాటలో శాలిని పాట పాడింది. ఈ పాటకు టీజర్, పూర్తి పాటను వదిలారు. ఏ మాత్రం బెదురు లేకుండా కాన్ఫిడెంట్తో శాలిని పాట పాడింది. అయితే ఆమె గొంతు సూపర్గా ఉంది. అద్భుతంగా ఉన్న ఆమె గొంతుకు మ్యూజిక్ నిండుతనం తెచ్చింది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ పూర్తి పాటను విడుదల చేశారు.ప్రస్తుతం శాలినీ సినిమాలతో బిజీగా ఉంది. సావిత్రి జీవిథ కథ ఆధారంగా రూపొందిస్తున్న ‘మహానటి’లో, కోలీవుడ్లో 100% లవ్ రీమేక్లో శాలిని నటిస్తోంది. మరికొన్ని లైన్లో ఉన్నాయి.