Friday, April 26, 2024
- Advertisement -

సూపర్ నటి అయేషా టాకియా గుర్తుందా ?

- Advertisement -

బాలీవుడ్ భామలను తెలుగులో పరిచయం చేయడంలో పూరి జగన్నాథ్ ఎప్పుడు టాప్ లో ఉంటారు. ఇప్పటికే కొందరు బాలీవుడు భామలను ఆయన టాలీవుడ్ కు పరిచయం చేశాడు. ఈ లిస్టులో అయేషా టాకియా కూడా ఉంది. ఈమె 15 ఏళ్లకే హీరోయిన్ మారి ‘తార్జన్ : ది వండర్ కార్’, ‘దిల్ మాంగే మోర్’ ‘సోచ న తా’ ‘షాదీ నెంబర్ 1’ వంటి చిత్రాలు చేసింది.

2005 లో నాగార్జున సరసన అయేషా టాకియా ను ‘సూపర్’ చిత్రంతో తెలుగులో పరిచయం చేశాడు పూరి జగన్నాథ్. ఈ చిత్రంలో సిరివల్లి అనే పాత్రలో ఈమె నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యింది. ఈ చిత్రంతో ఈమెకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఎందుకో ఈ బ్యూటీ మళ్ళీ తెలుగులో సినిమాలు చెయ్యలేదు. నిజానికి మహేష్ బాబు ఆల్ టైం హిట్ అయిన ‘పోకిరి’ సినిమాలో మొదట ఈమెనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ కు దూరం అయ్యింది. అయితే విచిత్రంగా ‘పోకిరి’ హిందీ రీమేక్ అయిన ‘వాంటెడ్’ లో సల్మాన్ సరసన నటించింది.

ఒరిజినల్ లో మిస్ అయినా రీమేక్ లో నటించింది అన్న మాట. 23 ఏళ్ళకే అంటే 2009 లో ఫరాన్ అజ్మీని పెళ్ళి చేసుకుని సినిమాలని తగ్గించింది. ఇక తాజాగా… ఏప్రిల్ 10 న తన 34 వ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ లో అయేషా మునిగి తేలింది. అందుకు సంబందించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలను చూసిన వారు అయేషా ఇలా అయిపొయింది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/B80oxqSHNg-/
https://www.instagram.com/p/B8DyG2In2vv/
https://www.instagram.com/p/B7oNKFaHXWV/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -