Friday, April 19, 2024
- Advertisement -

జాతీయ ఉత్తమ చిత్రం…. మోడీ రుణం తీర్చుకోనున్న రాజమౌళి

- Advertisement -

బాహుబలి ఫస్ట్ పార్ట్‌కి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డ్ వచ్చినప్పుడు జాతీయ అవార్డులపై కనీస స్థాయి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా షాకయ్యారు. తెలుగు వాళ్ళందరూ గర్వపడాలి అనే స్థాయిలో ఒక వర్గం మీడియా ద్వారా రాజమౌళి ఎంతగా ప్రచారం చేయించినా కూడా బాహుబలి పార్ట్ ఒన్‌కి జాతీయ అవార్డ్ రావడాన్ని విమర్శించినవాళ్ళే ఎక్కువ. సగం వండిన కథ….అది కూడా జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు పొందాలంటే ఉండాల్సిన లక్షణాల్లో ఒక్కటి కూడా లేని కథ…..అయితేనేం టిడిపి-బిజెపి పెద్దల పుణ్యమాని అవార్డ్ ఇంటికి నడుచుకుంటూ వచ్చింది. విశ్లేషకులు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ రాజమౌళికి క్రెడిట్ దక్కింది.

ఇప్పుడు బిజెపి రుణం తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు రాజమౌళి. చంద్రబాబుతో మీటింగులు, వ్యవహారాలు, బాలయ్యపై పొగడ్తలు…..జైబాలయ్య నినాదం జై హింద్‌తో సమానం అని కీరవాణి వ్యాఖ్యానించడం లాంటి వాటితో టిడిపి రుణం బాగానే తీర్చుకున్నారు రాజమౌళి అండ్ టీం. ఇప్పుడు బిజెపి రుణం తీర్చుకోవడానికి రెడీ అవుతున్నారు. 2019 ఎన్నికలకు ఉపయోగపడేలా ఆరెస్సెస్‌పై ఒక సినిమా తెరకెక్కించనున్నారు రాజమౌళి అండ్ టీం. రాజమౌళి దగ్గర వర్క్ చేసిన దర్శకుల్లో ఎవరో ఒకరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం ఈ సినిమాకు కథ కోసం విజయేంద్రప్రసాద్ అండ్ టీం వర్క్ చేస్తున్నారట. మొత్తం ప్రపంచంలోనే ఆరెస్సేస్‌ని మించిన సేవా సంస్థ, గొప్ప సంస్థ లేదు అని చాటి చెప్పేలా ఈ కథను తయారు చేయబోతున్నారు. రాజమౌళి టీం మొత్తం ఈ సినిమాలో భాగమవుతుందట. ప్రభాస్, కృష్ణంరాజులు కూడా ఇప్పటికీ బిజెపితోనే ఉన్న నేపథ్యంలో వాళ్ళకు కూడా ఈ సినిమాలో క్యారెక్టర్సో, గెస్ట్ అప్పీయరెన్స్‌లు ఉంటాయేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -