Tuesday, May 14, 2024
- Advertisement -

మీ అభిమానమే నా బలం.. నా పుట్టినరోజుకి ఎవరూ రావొద్దు : బాలకృష్ణ

- Advertisement -

దేశంలో కరోనా ఉధృతి బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో గత రెండు నెలలుగా కరోనా విలయతాండవం చేసింది. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కరోనా కట్టడి కోసం తెలంగాణలో లాక్ డౌన్ విధించారు. ఏపిలో 20 వరకు కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. తాజాగా నందమూరి బాలకృష్ణ తన ఫ్యాన్స్ కి ఓ మెసేజ్ అందించారు. బాలకృష్ణ జూన్ 10న పుట్టినరోజు జరుపుకోనున్నారు.. ఈ సందర్భంగా తన పుట్టినరోజు కి అభిమానులు ఎవరూ తరలి రావొద్దని పిలుపునిచ్చారు.

“నా ప్రాణ సమానులైన అభిమానులకు” అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన వెలువరించారు. ప్రతి ఏటా నా పుట్టినరోజు సందర్భంగా నన్ను కలిసేందుకు వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు తరలి వస్తుంటారు.. మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని.. కానీ ఇప్పుడు కరోనా విలయతాండవం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు బయటికి రావడం అభిలషణీయం కాదు. మీ అభిమానంతో సాటిరాగల ఆశీస్సు లేదు, మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు.

మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడపడమే నా జన్మదిన వేడుకగా భావిస్తాను.. ఈ కష్టకాలంలో ఎవరూ దయచేసి రావొద్దు అంటూ బాలయ్య కోరారు. అంతే కాదు ఈ విపత్కాలంలో అసువులు బాసిన అభిమానులకు, కార్యకర్తలకు, అభాగ్యులకు నివాళులు అర్పిస్తున్నానంటూ పేర్కొన్నారు.

ఆనందయ్య ‘కె’ మందుకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీలో 20 వరకు కర్ఫ్యూ పొడగింపు!

పోలీసులు అలాంటి వాళ్లే అంటూ హాట్ ఇష్యూపై శ్రీరెడ్డి షాకింగ్ రియాక్షన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -