నందమూరి తారకరామారావు జీవితచరిత్రను రూపొందించడానికి బాలకృష్ణ రంగంలోకి దిగారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ఆయన పోషించడమే కాదు .. ఆయనే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రెగ్యులర్ షూటింగు ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులంతా ఆసక్తితో ఎదురుచూస్తుండగా, దర్శకుడు తేజ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.రాఘవేంద్ర రావు, కృష్ణవంశీ, క్రిష్ లాంటి దర్శకులను సంప్రదించిన ఈ ప్రాజెక్ట్ను ముందుకు నడిపించేందుకు అంగీకరించకపోవటంతో బాలయ్య స్వయంగా దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో తెరపైకి ‘చంద్ర సిద్ధార్థ’ పేరు వచ్చింది. ఆ నలుగురు’ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న చంద్ర సిద్ధార్థ ఈ సినిమా దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతను చేపట్టనున్నట్టు తెలుస్తోంది. దర్శకత్వ పర్యవేక్షణ మాత్తమే చేస్తున్నారు చంద్ర సిద్ధార్థ. సినిమాకు దర్శకత్వం బాలకృష్ణే వహిస్తారని తెలుస్తుంది.ఈ విషయం అధికారికంగా వెలువడవలసి వుంది.