Friday, March 29, 2024
- Advertisement -

మళ్లీ నటుడిగా మారబోతున్న పవన్ కళ్యాణ్ నిర్మాత

- Advertisement -

ఇండస్ట్రీలో కమెడియన్ గా తన కెరియర్ ను ప్రారంభించిన బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్’, ఎన్టీఆర్ టెంపర్ సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. నిన్న మొన్నటి వరకు రాజకీయాలలో సైతం కనిపించిన బండ్ల గణేష్ ఇప్పుడు మళ్లీ సినిమాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో చాలా కాలం తర్వాత ఒక కమెడియన్ పాత్ర పోషిస్తూ బండ్ల గణేష్ మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నాడు. తాజాగా బండ్ల గణేష్ తన పాత్ర షూటింగ్ని పూర్తి చేసుకున్నాడు.

‘గబ్బర్ సింగ్’ లో అంత్యాక్షరి సీన్ లాగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ట్రైన్ లో జరిగే ఒక సన్నివేశం చాలా వినోదాత్మకంగా ఉంటుందని సమాచారం. ఈ సన్నివేశంలో బండ్ల గణేష్ కూడా ఉండబోతుందట. ఇప్పటికే తన పాత్ర షూటింగ్ పూర్తయింది. ఏమైనా ప్యాచ్ వర్క్ మిగిలి ఉంటే బండ్ల గణేష్ మరొక సారి షూటింగ్ కి రావాల్సి ఉంటుంది. ఈ సినిమా కోసం బండ్ల గణేష్ రోజుకి 5 లక్షలు డిమాండ్ చేశాడట. అయితే తన పాత్ర షూటింగ్ నాలుగు రోజులలో పూర్తి అయిపోవడంతో బండ్ల గణేష్ కు ఈ సినిమాతో 20 లక్షల దక్కాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -