- Advertisement -
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వరుస సినిమాతో బాక్సాఫీస్ మీద దాడి చేస్తున్నాడు.ఇటీవలే సాక్ష్యం సినిమాతో వచ్చిన బెల్లకొండ తాజాగా కవచం సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చిన తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై ఆకట్టుకుంది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
‘పద్మవ్యూహంలో ఆగిపోవడానికి నేను అభిమాన్యున్ని కాదురా..పోలీస్..” అనే డైలాగ్ తో సాయి ఆకర్షిస్తున్నాడు. మరి ఇప్పటివరకు వచ్చిన యాక్షన్ కథలతో కమర్షియల్ హిట్ పెద్దగా అందుకొని బెల్లంకొండ వారసుడు ఇప్పుడైనా ఈ కవచంతో హిట్టు అందుకుంటాడో లేదో చూడాలి. ఈ సినిమా హీరోయిన్స్గా కాజల్ అగర్వాల్ – మెహ్రీన్లు నటిస్తున్నారు.ఇక ఈ సినిమాను డిసెంబర్ 7న విడుదల చేయనున్నారు.