Monday, May 13, 2024
- Advertisement -

మెగా హీరోని త‌ప్పించి బెల్ల‌కొండ‌ని తీసుకున్నార‌ట‌..!

- Advertisement -

మెగా మేన‌ల్లుడిగా ఇండ‌స్ట్రీకి అడుగుపెట్టాడు సాయి ధ‌ర‌మ్ తేజ్.కెరీర్ స్టార్టింగ్‌లో మంచి విజయాలే సాధించిన సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌రువాత వ‌రుస ప్లాప్‌లు చ‌విచూసి రేస్‌లో వెనుక‌ప‌డ్డాడు.ప్ర‌స్తుతం అత‌ను చేయాల్సిన సినిమాలు మ‌రో హీరో చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ఒక సినిమా చేస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. సాయి మాధవ్ బుర్ర మరియు గోపి గ్యాంగ్ కలిసి రాసుకున్న ఆ కథను మెగా హీరో మెచ్చాడు కానీ ప్రస్తుతం అతను బిజీగా ఉన్నాడు.

దీంతో ఆ కథను బెల్లంకొండ కాంపౌండ్ కు వెళ్లినట్లు సమాచారం. యూ టర్న్ నిర్మాతలు సినిమాను నిర్మించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 4 సినిమాలను లైన్ లో పెట్టాడు. కొత్త డైరెక్టర్ తో మరియు తేజ దర్శకత్వంలో సినిమాలను చేస్తూనే రమేష్ వర్మ కథ, మరో కొత్త డైరెక్టర్ కథను ఒకే చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -